రైతులకు సంకెళ్లు వేయించిన ఘనత కెసిఆర్‌ది: విహెచ్‌

వికారాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి):

రైతులకు సంకేళ్లు వేయించిన ఘనత దేశంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గిట్టుబాటు ధరను కోరే హక్కు రైతుకు ఉందని, దానికోసమే నిరసన తెలిపిన రైతులను జైలుకు పంపిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని, మనకు ప్రభుత్వం ఉందా? అని వీహెచ్‌ అని ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని, దొంగనాటకం ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకరిపై ఒకరు నెడుతూ రైతులతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. రైతులకు టీఆర్‌ఎస్‌ మోసాలను పార్లమెంట్‌లో నిలదీస్తామని హనుమంతరావు తెలిపారు.