వరద బాధిత పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

బూర్గంపహాడ్ జూలై 30(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం గౌతమి పురం రబ్బూనీ చర్చి లో పాల్వంచకు చెందిన జాన్ బాబు అండ్ టీం ఆధ్వర్యంలో గోదావరి వరద బాధిత
పాస్టర్లకు శుక్రవారం నిత్యావసర సరుకులను అంద జేశారు. గోదావరి వరద ప్రాంతాలైన బూర్గంపహాడ్, కుక్కునూరు, వేలేరుపాడు, మండలాలకు చెందిన 20 మంది పాస్టర్లకు సుమారు రూ. 20 వేలు విలువ గలిగిన నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందజేశారు. పాస్టర్లకు నిత్యావసర సరుకులను జాన్ బాబు, బృందం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాన్ బాబు బృందం సభ్యులు అనిల్, ప్రేమ్ కుమార్, బ్లెసింగ్ టన్, రవి, పాస్టర్ లు డి.పెద్దారావు, ఎం రవి, సల్మాన్, ఐజక్, టి.మహిమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.