విఘ్నేష్‌ కుటుంబానికి 5లక్షల సాయం అందచేత

కుమ్రం భీం ఆసిఫాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెద్దపులి దాడిలో మృతి చెందిన దహెగాం మండలం

దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుటుంబానికి శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వారి కుటుంబంలో ఒకిరికి అటవీ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని,ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.