విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ`సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.66 లక్షలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సిగరెట్లను సీజ్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.