వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలి

భారత్‌ లో ఒమిక్రాన్‌ ప్రవేశించడం ఊహించని పరిమాణం

అందరూ అప్రమత్తంగా ఉండాలి

భారత్‌ లో కేసుల నమోదుపై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

న్యూఢల్లీి,డిసెంబర్‌3(జనంసాక్షి): ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. ఇక తాజాగా భారత దేశంలోనూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే భారత దేశంలో తాజాగా నమోదైన ఒమిక్రాన్‌ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కర్ణాటకలో కోవిడ్‌ -19 యొక్క తాజా వేరియంట్‌ అయిన ఒమిక్రాన్‌ యొక్క రెండు కేసులను గుర్తించడంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలు నివసించే పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచం దృష్ట్యా భారతదేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదు కావడం ఊహించనిది కాదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజినల్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ మనమంతా దేశాలు అనుసంధానమైన ప్రపంచంలో బ్రతుకుతున్నామని పేర్కొన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని, అన్ని దేశాలు కరోనా మహమ్మారిపై నిఘా పెంచాలని, ఏదైనా ప్రాముఖ్యతను వేగంగా గుర్తించాలని, వైరస్‌ యొక్క మరింత వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో గుర్తించిన తొలి రెండు కేసులు ఇవేనన్న డబ్ల్యూహెచ్‌ఓ కరోనా ఇతర వేరియంట్‌ లకు జాగ్రత్తలు తీసుకున్న విధంగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిరచారు. ఒమిక్రాన్‌ వేరియంట్లో ఉత్పరివర్తనాలు ఎక్కువగా ఉన్నాయని, అందులో కొన్ని చాలా ఆందోళనకరంగా ఉన్నాయని డాక్టర్‌ పూనమ్‌ ఖేత్ర పాల్‌ పేర్కొన్నారు. అన్ని దేశాలు ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సూచించిన డాక్టర్‌ పూనమ్‌ ఆగ్నేయాసియాలో గుర్తించిన తొలి రెండు కేసులు ఇవేనని వెల్లడిరచారు. కొత్త వేరియంట్‌ యొక్క కేసులను త్వరగా గుర్తించి, నివేదించగలిగిన దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందిస్తుంది అని సింగ్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు. ఒమిక్రాన్‌తో సహా అన్ని రకాల వేరియంట్‌ ల కోసం ప్రతిస్పందన చర్యలు  .ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కొత్త కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కు సంబంధించిన మొత్తం ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు . అందుకే ఎవరూ నిర్లక్ష్యం చెయ్యొద్దు అని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కర్నాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడిరచింది. ఇద్దరు వ్యక్తులు దక్షిణాఫ్రికా నుండి ప్రయాణించారని, వారి పరిచయాలు గుర్తించబడ్డాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌  డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు. ఒమిక్రాన్‌ సంబంధిత కేసులన్నీ ఇప్పటివరకు తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడిరదని వెల్లడిరచారు. దేశంలో మరియు విదేశాలలో ఇటువంటి అన్ని సందర్భాలలో ఒమిక్రాన్‌ ఇన్ఫెక్షన్‌లో తీవ్రమైన లక్షణాలు ఏవీ గుర్తించబడలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరణ కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది . ఇప్పటి వరకు తాజాగా ఇండియాలో రెండు కేసులు నమోదు కాగా, బోట్స్వానా – 19 కేసులు, దక్షిణాఫ్రికా – 172 కేసులు, నైజీరియా , యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ,దక్షిణ కొరియ, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చెక్‌ రిపబ్లిక్‌, ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, నార్వే ,స్పెయిన్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, కెనడా, డెన్మార్క్‌ దేశాలలోనూ ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది.