వ్యక్తిగత పరిశుభ్రత పై మహిళలకు అవగాహన సదస్సు.

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 26 మండలంలోని గుండంపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత పై, నాప్కిన్లను కొనుగోలు చేసేటప్పుడు గల ఇబ్బందిని ధృష్టిలో ఉంచుకొని సెల్ఫీ విత్ నాప్కిన్ కార్యక్రమాన్నీ నిర్వహించారు…. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నవ్య
మహాత్మా గాంధీ నేషనల్ ఫెలో,
స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ,జగిత్యాల వారు మాట్లాడుతూ గుండంపల్లి గ్రామంలో మహిళలు నెలసరి సమయంలో బయోడిగ్రీడబుల్ నాప్కిన్ల వాడకంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ప్లాస్టిక్ నాప్కిన్ల ను వాడటం వల్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని మరియు వాటిని దహనం చేసినప్పుడు , లేదా భూమిలో పడినప్పుడు పర్యావరణానికి హాని చేకూర్చిన వాళ్ళం అవుతాం కనుక మహిళలు అందరూ బయోడిగ్రీడబుల్ నాప్కిన్ల ను వాడాలని మరియు కొనుగోలు చేసేటప్పుడు మోహమాటన్ని విడిచిపెట్టాలని అందుకు గుండంపల్లి గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ నాప్కిన్ కార్యక్రమాన్ని నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు… సర్పంచ్ ధనరేకుల మల్లు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ నాప్కిన్ల ను కొనుగోలు చేస్తున్నప్పుడు మహిళల