శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అమ్మకానికి

ఢిల్లీ .హైదరాబాద్‌ .ముంబై .బెంగళూరు
విమానాశ్రయాల్లో వాటా విక్రయం
మరో13 ఎయిర్‌ పోర్ట్‌ లు ప్రైవేటీకరణ
హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) :
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హైదరా బాద్‌- రంగారెడ్డి -మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. తెరాస తరఫున సురభి వాణీదేవి, భాజపా నుంచి రామచందర్‌ రావు, కాంగ్రెస్‌ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగే శ్వర్‌ మధ్య గట్టి పోటీ నడిచింది. ఈ స్థానంలో సాయంత్రం కేంద్రం నిర్ణయించినట్టు అధికార వర్గాల కథనం. ఇప్పటికే తొలిదశలో లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణకు మొత్తం 13 విమానాశ్రయాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో హైదరాబాద్‌ సహా నాలుగు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించిన్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలు త్వరలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదానికి పెట్టనున్నారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ విషయమై కేంద్రం.. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100పై చిలుకు విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది. కాగా, ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్‌ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్‌ ఏజీ అండ్‌ ఎరామన్‌ మలేసియాకు 10 శాతం వాటా ఉంది. హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.