శ్రీ.రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి జిన్నారం ఎంపీపీ 1,70,000 రూపాయలు గ్రానైట్ పనులకు విరాళం అందజేత

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ .రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ తరపున జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ గుడి నిర్మాణానికి కావలసిన గ్రానైట్స్ కు ఒక్క లక్ష 70 వేల రూపాయలు విరాళం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రమేష్, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కొడకంచి మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ, జంగంపేట్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదిరులు పాల్గొన్నారు.