సండే ఫన్‌డేగా.. ఇక మన చార్మినార్‌


హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్‌ వద్దా చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్దా నిర్వహించాలని ఇద్దరు మంత్రులు సూచించారన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని, ఈ మేరకు ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలను ఆహ్వానిస్తామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. రాత్రి 11.30 గంటలకు దాటాక చార్మినార్‌ దగ్గర ఉంటే పోలీసులు ఇళ్లకు వెళ్లండంటూ పంపిచేస్తున్నారని, అలా కాకుండా నైట్‌లైఫ్‌ని ఆస్వాదించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.