సదాశివపేట్ పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని వినతి..

అర్ధులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సదాశివపేట పట్టణంలో బిజెపి అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐకి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,, నిరుపేదలకు కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు తీసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. అలాగే లాటరీ పద్ధతిలో కాకుండా నిజమైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.