సుజాతానగర్‌ టిఆర్‌ఎస్‌లో విభేదాు

స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌18(జ‌నంసాక్షి): అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జగం వెంకట్రావు అభిమాను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ , పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోటోతో ప్లెక్సీను ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్లెక్సీను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనుచయి చించేసినట్లు ఆరోపణు మ్లెవెత్తుతున్నాయి. ప్లెక్సీ తొగింపుపై సమాచారం అందుకున్న జగం వెంకట్రావు అభిమాను.. ఎమ్మెల్యే వనమా పై మండిపడ్డారు. తెంగాణ ఉద్యమం నుండి టిఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి కోసం, అభ్యర్థు గొపు కోసం పని చేశామని కానీ ఇతర పార్టీ నుంచి వచ్చి వచ్చిన ఎమ్మెల్యే వనమా అతని కుమారుడు రాఘవేంద్ర రావు అనుచయి తమని పట్టించుకోవడం లేదని, అనేక రకాుగా ఇబ్బందుకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ సుజాత నగర్‌ పర్యటన సందర్భంగా తాము ఏర్పాటు చేసిన ప్లెక్సీను తొగించడంపై తాము పోలీసుకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని జగం వెంకట్రావు అభిమాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.