స్వచ్ఛ ఆటోలో మాత్రమే చెత్తను వెయ్యాలి

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ గుల్లగూడ కాలనీలో జిహెచ్ఎంసి మరియు రాంకీ సంస్థ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలసి చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోలో మాత్రమే వేయాలని కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా పెంచుకోవాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఎంహెచ్ఓ మంజుల, శానిటేషన్ అధికారి ప్రభాకర్, రాంకి సంస్థ చైర్మన్ రామకృష్ణ, నరసింహారావు, తిరుపతి, ముందా సర్, నాసర్, మల్లేశం, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.