హైదరాబాద్‌లో చిరుత క‌ల‌క‌లం

రంగారెడ్డి, మే 14(జనంసాక్షి):లాక్‌ డౌన్‌ అమలైనప్పటి నుంచి రహదారుపై జనసంచారం లేదు. దీంతో అడవుల్లో ఉన్న జంతువు.. రోడ్లపైకి యథేచ్చగా వస్తున్నాయి. జంతువు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రజను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పు రాష్ట్రాల్లో రోడ్లపైకి అడవి జంతువు వచ్చిన సంఘటను చూశాం. తాజాగా హైదరాబాద్‌ కు సవిూపంలోని కాటేదాన్‌ వద్ద ఓ చిరుతపులి రోడ్డుపైకి వచ్చి అందరిని భయభ్రాంతుకు గురి చేసింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద(ఎన్‌హెచ్‌`44కు సవిూపంలో) గురువారం త్లెవారుజామున స్థానికు చిరుతను గుర్తించారు. ఆ చిరుత కాలికి గాయం కావడంతో కదల్లేని స్థితిలో ఉండిపోయింది. రోడ్డుపై చిరుత ఉన్న విషయాన్ని స్థానికు పోలీసుకు, అటవీ అధికారుకు సమాచారం అందించారు.ఇక చిరుత పులికి అతి సవిూపంలో ఉండి స్థానికు వీడియోు చిత్రీకరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు.. జాతీయ రహదారిపై రాకపోకను నియంత్రించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికాయి ప్రయత్నించగా.. తప్పించుకుని సవిూపంలో ఉన్న ఫంక్షన్‌ హాల్‌ లోకి వెళ్లింది. ఆ ఫంక్షన్‌ హాల్‌ నుంచి అక్కడే ఉన్న బొప్పాయి తోటలోకి చిరుత పులి దూకినట్లు అధికాయి భావిస్తున్నారు. డ్రోన్‌ కెమెరా సాయంతో చిరుత ఉన్న ప్రదేశాన్ని అధికాయి గుర్తించారు. ఫంక్షన్‌ హాల్‌ లోకి వెళ్లే క్రమంలో అక్కడున్న ఓ లారీ డ్రైవర్‌ ను చిరుత గాయపరిచింది. అతన్ని చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రికి తరలించారు.