కేంద్రమంత్రి జైశ్వాల్‌పై కేసు నమోదు

కాన్పూరు: కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకావ్‌ జైశ్వాల్‌పై కాన్పూరు జిల్లా కోర్టులో కేసు నమోదు అయ్యింది. మహిళల పట్ల జైశ్వాల్‌ అనుచిత వ్యాఖ్యాలకు చేశారంటూ అనితా దువా అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మంత్రి వ్యాఖ్యాలకు సంబంధించి సీడీతో పాటు స్యూస్‌ పేపర్‌ క్లిప్పింగ్‌లను ఆమె కోర్టుకు సమర్చించారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానం ఈ నెల 8వ తేదీన అనితా దువా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. కాగా నేరం రుజువు అయితే మంత్రికి రేండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.