జగన్‌ అరెస్టును కోర్టు తేల్చుతుంది: సీబీఐ జేడి

గుంటూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు సక్రమమా, అక్రమమా అనేది కోర్టు తేల్చుతుందని సీబీఐ జేడి లక్ష్మినారాయణ అన్నారు. జగన్‌ అక్రమాస్థుల కేసులో తుది విచారణ పూర్తయ్యాకే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని సీబీఐ జేడి చెప్పారు. విచారణ ఇంకా నడుస్తున్నందువల్లనే ఛార్జిషీట్‌ దాఖలు చేయలేదన్నారు.