జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లతో సీఎం ముఖాముఖి
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లు సమర్థమైన పాత్ర పోసించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్టిఆలిటీ మేనేజ్మెంట్లో ఆయన వాలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ పొందుతున్న వివిధ కళాశాలల విద్యార్థులకు అవసరమైన మెలకువలు నేర్పుతున్నామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఛైర్మన్చందనాఖాన్ అన్నారు.



