టీవీ ఆర్టిస్టులపై కేసులు పెట్టడం దారుణం

హైదరాబాద్‌ : డబ్బింగ్‌ సీరియల్స్‌ ,డబ్బింగ్‌ సినిమాలు బ్యాన్‌ చేసే విధంగా తీర్మానం తీసుకుంటామని నటుడు మురళీమోహన్‌ అన్నారు. టీవీ ఆర్టిస్టులపై నాన్‌బేయిలబుల్‌ కేసులుపెట్టడం చాలా దురదృష్టకరమని ఆయన వాఖ్యానించారు.డబ్బింగ్‌ సీరియల్స్‌ నిషేదం కోసం నిరాహారాదీక్ష చేపట్టిన టీవీ ఆర్టీస్టు విజయ్‌యాదవ్‌కు మురళీమోహన్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.