తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చేందుకే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చేందుకే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే, ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని మరోసారి బుట్టదాఖలు చేసేందుకు అఖిలపక్షాన్ని తెరపైకి తెస్తుందని ఆయన విమర్శించారు. కాగా, అవినీతి  ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అధికారంలో కొనసాగే హక్కులేదని,ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు.