తేదేపా సంతకాల సేకరణ ప్రారంభం
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెదేపా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టుంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద నేతలు సంతకాల సేకరణను ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రజాభిప్రాయం సేకరించనున్నట్లు నేతలు తెలిపారు. రెండు కోట్లుకుపైగా సంతకాలతో గవర్నర్కు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.


