నవంబరు 1న విద్రోహదినం: కేసీఆర్‌

హైదరాబాద్‌: నవంబరు 1న విద్రోహదినంగా పాటించి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ప్రకటించారు, తెలంగాణ వస్తే సంతోషమని లేకుంటే యుద్ధమేనని ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ప్రణాళికపై మేథోమథన సదస్సులో చర్చించనున్నామని ఆయన వెల్లడించారు. యావత్‌ తెలంగాణ సమాజాన్ని ఒక రాజకీయశక్తిగా అవతరింపజేస్తామన కేసీఆర్‌ చెప్పారు.