నేటితో ముగియనున్న సీఎం కర్నూలు జిల్లా పర్యటన

కర్నూలు: జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడురోజుల పర్యటన నేటితో ముగియనుంది. పర్యటన చివరిరోజు ఆయన ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శ్రీశైలం మండలాల్లో పర్యటించనున్నారు. చివరిగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంజ సమేత  మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుని అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనమవుతారు.