ప్రధానికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌: ప్రధానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉపరితల బొగ్గు గనుల వల్ల జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తెలంగాణ  రాజకీయ ఐకాస నిరసన కార్యక్రమంలో తమ పార్టీ పాల్గొంటుందని తెలియజేశారు.