ప్రభుత్వానిది అమానుష చర్య : నారాయణ

హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరామర్శించారు. అర్థరాత్రి దీక్షను భగ్నం చేసి చేతలను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం అమానషమైన చర్య అని మండిపడ్డారు. విద్యుత్‌ ఉద్యమంలో భాగంగా భవిష్యత్‌ కార్యాచరణపై తెదేపా ఏ ప్రకటన చేసినా క్షేత్రస్థాయిలో మద్దతు ఇస్తామని ప్రకటించారు.