బస్ భవన్ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
హైదరాబాద్ అర్టీసీ చార్జీలను పెంచడమే కాకుండా…. బస్సు పాసుల ధరల్ని పెంచడంపె ౖవిద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… ఎస్ ఎప్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్లోని బస్బవన్ ముట్టడికి ప్రయత్నించారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేస్తూ… లోపలికి చోచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలిసులు అడ్డుకుని అందోళన కారులను అరెస్టుచేశారు.



