మండలిలో విపక్ష సభ్యుల ఆందోళన
హైదరాబాద్ : విద్యుత్ సర్ఛార్జీల అంశంపై శాసన మండలిలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ చక్రవాణి తిరస్కరించారు. దీంతో సభ్యులు నిరసనకు దిగారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానాలపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు.


