మృతిడి కుటుంబాన్ని పరామర్శించిన సబితా
హైదరాబాద్ : శంషాబాద్ మండలం కవేలిగూడలో దోపిడి దొంగల దాడిలో మరణించిన మల్లేష్ కుటుంబాన్ని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇలాంటి సరఘటనలు పునరావృతం కాకుండ ఉండేదుకు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మల్లేష్ను హతమార్చి పారిపోతున్న ముగ్గురు దొంగల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.


