మేజర్ పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
విశాఖపట్నం : అలిండియా మేజర్ పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఱ పోర్టు ట్రస్టు ఛైర్మన్ అజేయ కల్లాం హాజరయ్యారు. అక్కయ్య పాలెం పోర్టు ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 10 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. బాస్కెట్బాల్, క్యారమ్స్, చదరంగం వంటి ఇండోర్ గేమ్స్ను 2006 నుంచి ఏటా విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.


