రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సే: సోమిరెడ్డి
హైదరాబాద్: రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సేనని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. దేశాన్ని మన్మోహన్సింగ్, రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అవినీతిమయం చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్ పాలనలో చెప్పుకోదగినది అవినీతి కుంభకోణాలే తప్ప మరొకటి లేదన్నారు. ప్రజల సంక్షేమం వదిలేసి సేవ్ కాంగ్రెస్ అని మేథోమధనం, డైరీ ఆవిష్కరణలు చేయడం విడ్డూరమని సోమిరెడ్డి విమర్శించారు.



