రాష్ట్రం బంద్కు మద్దతు తెలిపిన టీడీపీ
హైదరాబాద్ : విద్యుత్ కోతలు, సర్చార్జీల భారానికి నిరసనగా వచ్చే నెల 9న తేదీన వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యుత్ సమస్యలపై టీడీపీ చేపట్టిన దీక్షలు నేటికి మూడో రోజుకు చేరుకున్నాయి. కాగా టీడీపీ నేతల దీక్షలకు వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు.


