రాష్ట్ర శాసనమండలి వాయిదా

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. విద్యుత్‌ సమస్యపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఐదురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 13 గంటల 54 నిమిషాల పాటు సభ జరిగింది.