రూ.2 కోట్ల విలువైన పప్పు బస్తాల సీజ్‌

కంచికచర్ల(కృష్ణా): కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పరిటాల పప్పుల మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ నిల్వలను గుర్తించి.. రూ.2 కోట్ల విలువైన పప్పు ఒస్తాలను సీజ్‌ చేశారు. జిల్లా విజిలెన్స్‌ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.