రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

కృష్ణా : రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద ద్విచక్రవాహనం, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.