విద్యుత్ఛార్జీల పెంపుపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ హైకోర్టు స్వీకరించింది. ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఈఆర్సీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


