వివేక్ నివాసంలో టీ. కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు భేటీ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ నిర్వహణపై చర్చించేందుకు పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మార్చ్కు ప్రభుత్వం అనుమతిచ్చినా నేపథ్యంలో ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఎంపీలు పొన్నం ప్రభాకర్చ మందా జగన్నాథం, కే. కేశవరావుతో పాటు మంత్రులు , జేఏసీ నేతలు ప్రొ. కోదండరాం, స్వామిగౌడ్, విఠల్, శ్రీనివాస్గౌడ్లు హాజరయ్యారు.



