వైద్యాధికారుల సవిూక్షలో మంత్రి హరీష్
ఆదిలాబాద్,మార్చి4(జనం సాక్షి): సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దవాఖానకి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. రెఫరల్ కేసులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*