హైదరాబాద్‌కు చేరుకున్న ఆజాద్‌

హైదరాబాద్‌: వివిధ కార్యక్రమల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కుమారై వివాహానికి ఆయన హాజరవుతారు. వినోబాబావే జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా భూదాస్‌పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గోంటారు. ఆజాద్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఆయనతో భేటీ అయి రాష్ట్ర పిరస్థితులపై చర్చించే అవకాశం ఉంది.