10 గంటలకు వాయిదా పడిన శాసన సభ
హైదరాబాద్ : శాసన సభ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికి విపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడ్డాయి. వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు.


