ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు

అమరావతి,అగస్టు12(జనం సాక్షి): గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా 13,595 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 18,688 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటవరకు కరోనా నుంచి మొత్తం 19,56,627 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 70,757 శాంపిల్స్‌ సేకరించారు. 24 గంటల్లో 1,575 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 18,688 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, ఇప్పటివరకు 2,54,53,520 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. కరోనా వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. కొత్తగా నమోదైన
కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 402 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 233, నెల్లూరు జిల్లాలో 225 కేసులు వెలుగుచూశాయి.