కదిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం


పెల్లి పత్రికలు పంచడానికి వెళ్తూ మృత్యువాత
అమరావతి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామానికి మహేశ్‌ (26)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ 27న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బంధువులకు పెండ్లి పత్రికలు పంచేందుకు మహేశ్‌ ఉదయం బైక్‌పై వెళ్తుండగా ఎరుకులవాండ్లపల్లి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.