తాగిన మైకంలో భార్య, కొడుకు పై దాడి

ఒంగోలు,అగస్టు16(జనంసాక్షి): ప్రకాశం జిల్లా దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి..భార్య, కొడుకులతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులోనే..భార్య, ఇద్దరు కొడుకులపై కోడి కత్తితో దాడి చేశాడు. భర్త దాడిలో భార్య, కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సవిూప బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.