నేడు విడుదల కానున్న సీతారామం

ట్రైలర్‌ రిలీజ్‌కు ప్రభాస్‌ రాకతో పెరిగిన హైప్‌
మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మరాఠీ భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ’సీతారామం’. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ రష్మిక కీలక పాత్ర సోషించింది. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. బుధవారం జరిగిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రావడంతో ’సీతారామం’పై మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. ఈనెల 5న శుక్రవరాం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా
విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ’సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.18.70 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంట. నైజాంలో అత్యధికంగా రూ. 5 కోట్లు అమ్ముడు అవ్వగా.. సీడెడ్‌ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రూ. 0.70 కోట్లు, ఓవర్సీస్‌ రూ. 2.5 కోట్లు, ఇతర భాషాల్లో 1.50 కోట్లు బిజినెస్‌ చేసిందట. చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు