యానాం మార్కెట్‌లో పులసకు రికార్డు ధర

కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): యానాంలో సోమవారం రెండు కిలోలుపైగా ఉన్న పులస చేపను రికార్డు స్థాయిలో రూ.20 వేలకు ఓ చేపల వ్యాపారి పాడుకుంది. యానాం గోదావరిలో ఒక మత్స్యకారుడి వలకు
సెన ఉన్న ఆడ పులస చిక్కింది. సోమవారం ఆ పులసను యానాం మార్కెట్‌కు తీసుకువచ్చి వేలంపెట్టాడు. చేపల వ్యాపారి నాటి పార్వతి రూ.20 వేలకు పాడు కుంది. యానాం మార్కెట్‌లో ఇదే రికార్డు ధర. ఆమె రూ.20 వేలకు మించి ఒక వ్యక్తికి విక్రయిం చింది. 30 రోజుల క్రితం యానాంలో ఒక పులసను ఒక వ్యక్తి రూ.17 వేలకు పాడుకున్నాడు. ఈ సీజన్‌లో పులసకు భలే గిరాకీ ఉంటుంది.