స్కూళ్లల్లో బయటపడుతున్న కరోనా కేసులు


ఆందోళనలో టీచర్లు, విద్యార్థులు
తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన పాజిటివ్‌
విజయవాడ,అగస్టు23(జనంసాక్షి): ఎపిలో కరోనా మహమ్మారి పంజాని విసురుతుంది. ఇటీవల స్కూళ్లు తెరవడంతో విద్యార్థుల్లో కేసులు బయటపడుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో కొందరు టీచర్లకు, విద్యార్థులకు బయటపడ్డ కరోనా తాజాగా కృష్ణా జిల్లాలోనూ వెలుగు చూసింది. కరోనా ఉధృతి తగ్గిందనుకుంటే తాజాగా కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం చోటుచేసుకోవడం జరిగింది. పెదపాలపర్రు జెడ్పి ఉన్నత పాఠశాల ఇంకా గురజ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన కొవిడ్‌ టెస్టుల్లో ఏకంగా 11 మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అవ్వడం జరిగింది.పెదపాలపర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ర్యాండమ్‌ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నలుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు అలాగే టి.సి తీసుకునేందుకు వచ్చిన నలుగురు పదవ తరగతి విద్యార్థులు ఇంకా ఇద్దరు తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు చేయగా వారికి కరోనా పాజిటివ్‌ ఫలితాలు రావడం జరిగింది. ఇక గురజ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో మూడో తరగతి విద్యార్థికి కూడా కరోనా వైరస్‌ నిర్దారణ అవ్వడం జరిగింది. ఇక దాంతో బాగా అప్రమత్తమైన మండల విద్యాశాఖ అధికారులు పెదపాలపర్రు జడ్పీ పాఠశాలకు సోమవారం , మంగళ వారం రెండు
రోజులు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక అలాగే గురజ పాఠశాలకు చెందిన అన్ని తరగతుల విద్యార్థులకు కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇక అక్కడ పాఠశాలల్లో పరిస్థితి అనేది అదుపు తప్పకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని మండల విద్యాశాఖ అధికారి నరేష్‌ తెలియజేయడం జరిగింది. ఇక అలాగే ఉన్నతాధికారుల సూచనల ప్రకారం అవసరమైతే పెదపాలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలకు కూడా సెలవులు పొడిగిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మండలంలోని ఇతర స్కూల్స్‌ లో కూడా అన్ని తరగతుల విద్యార్థులకు ర్యాండమ్‌ గా కొవిడ్‌ పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నామని ఎంఈఓ నరేష్‌ తెలిపడం జరిగింది.