ఉద్యోగుల విభజనకు స్థానికతే ఆధారం కావాలి

3

టిఎన్‌జిఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌ 4 (జనంసాక్షి) :  స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. కమలనాధన్‌ కమిటీపై ఆంధప్రదేశ్‌ సాధారణ పరిపాలన శాఖ  పెత్తనం చేస్తోందని దేవీ ప్రసాద్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని దేవీ ప్రసాద్‌ హెచ్చరించారు. 8 (ఎఫ్‌ ) నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ జీవోను తొలగించాల్సిందేనని  టీఎన్‌జీ వో నేత విఠల్‌ అన్నారు.  కమలనాధన్‌ కమిటీని కేంద్రం కీలుబొమ్మలా చేసి ఆడిస్తోందని, జోనల్‌, జిల్లా పోస్టుల విభజన కూడా జరగాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం వెకిలి చేష్టలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాసగౌడ్‌ వ్యాఖ్యలు చేశారు.  ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్రకు ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్‌ కమిటీని రెండు రాష్టాల్ర ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ కమిటీకి సూచనలు, అభ్యంతరాలు ఇవ్వడానికి రేపే  తుది గడువు.  తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మార్గదర్శకాలపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కమలనాథ్‌కు  ఓ లేఖ సమర్పించారు. ఏపి ఉద్యోగ సంఘాల నేతలు కూడా  కమలనాథన్‌ను  కలిసి 18 హక్కు క్లాజ్‌ను తొలగించాలని కోరారు. భార్యాభర్తల ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు దంపతుల  ఆప్షన్‌ను కోరారు. ఎల్‌టీసీలోని ¬మ్‌టౌన్‌ ఆప్షన్‌ను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు.