పంచాయతీ కార్మికులకు అండగా కాంగ్రెస్ యువ నాయకులు చల్ల తేజ

మిర్యాలగూడ, జనం సాక్షి :

సమస్యల సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ అండగా నిలిచారు. సోమవారం మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో నిరాహార దీక్షలు చేపడుతున్న పంచాయతీ కార్మికులకు చల్ల తేజ బృందం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా కార్మికులకు చల్ల తేజ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు సైదులు తదితరులు పాల్గొన్నారు.