ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి

టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనంసాక్షి) : టేకులపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ టిపి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు . బోడు రోడ్డు సెంటర్లో వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ టిపి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు బానోత్ సుజాత మంగీలాల్, మండల  అధ్యక్షులు భూక్య బాలాజీ, నాయకులు                    నర్సింగ్ లక్ష్మయ్య, అంతోటి రాకేష్, బానోత్ శ్రీకాంత్, భుఖ్య కుమార్, భూక్య బద్రు, గుండా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.