గ్రామపంచాయితీ భవనం ప్రారంభం

మహబూబ్‌ నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌బండారి భాస్కర్‌, గద్వాల నియోజక వర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జ్‌ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.