పండిత్ దీన్ దయల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ

పండిత్ దీన్ దయల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ మరియు నాయకులు
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 :
జనం సాక్షి

పండిత్ దీన్ దయల్ జయంతి సంధర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో దీన్ దయల్ చిత్రపటానికి పూల దండలు వేసి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ నివాళులు అర్పించారు. అనంతరం 18వ వార్డు లో మొక్కలు నాటారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి వికాసం, సమాజ హితం, విశ్వమానవ కళ్యాణమే లక్ష్యంగా ఏకాత్మ మానవ వాదం ప్రతిపదించింది…. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పథకాలు మొదటి ప్రయోజనం చేకూరలన్న అంత్యోదయ భావనను రూపొందించి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ కి పటిష్ట పునాదులు వేసిన గొప్ప దర్శనికుడు పండిత్ దీన్ దయల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, కోరుట్లనియోజకవర్గ ఇంచార్జి జెయన్ వెంకట్, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోనికేల నవీన్, ఐటీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ మిట్టపల్లి సాయికుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుఖేందర్ గౌడ్ మీనా, బిజెపి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్నె గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి , కొల్లెపు శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్ యాదవ్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్, వరలక్ష్మి, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షుడు ముద్రకొల్ల రాజకుమార్, బీజేవైఎం కార్యదర్శిలు మిట్టపల్లి శివ, యమ వినోద్, భీమనతి విజయ్ తదితరులు పాల్గొన్నారు