పోడు భూములకు పట్టాలివ్వాలంటూ వనమా ఆధ్వర్యంలో ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కాస్తులో వున్న హరిజన, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసి రైతుభందు పథకం అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ శాసన సభ్యులు వనామా నాగేశ్వరరావు డిమాండ చేశారు. కైలురైతును విస్మరించడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయం ముట్టడి జరిగింది. వందలాదిగా కార్యకర్తుల ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌ వద్దకు చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలు అవలంబిస్తోందిన వనమా అన్నారు.