బయ్యారం గనులు జిందాల్కు కటట్టబెట్టే కుట్ర: తమ్మినేని
భద్రాద్రి,జూలై18(జనం సాక్షి): తెలంగాణలో హెల్త్ ఎమ్జర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రండిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో అప్పుడే వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు. బయ్యారం గనులను జిందాల్ కంపెనీకి కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 25న మహుబూబాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. పోడు రైతుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారి నుంచి భూములు లాగేసుకుంటున్నారని అన్నారు. పోడు రైతులకు అండగా ఉంటామని చెప్పి ఇదే పద్దతని ప్రశ్నించారు.